తెలుగువారికి 2 రాష్ట్రాలుంటే తప్పేంటి?:బొత్స

హిందీ మాట్లాడేవారికి 13 రాష్ట్రాలు ఉండగా, తెలుగు మాట్లాడేవారికి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి? అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు శిరోధార్యమేనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు ప్రత్యర్థి పార్టీయేనని స్పష్టం చేశారు. పీసీసీ పునర్‌వ్యవస్థీకరణపై అధిష్టానాన్ని ఇంతవరకు అనుమతి అడగలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తోందని, అందుకే ఆలస్యమవుతుందని చెప్పారు.

posted in: News, News Update, State

Leave a Reply