శిశు హత్యలపై చిత్రంలో కాజోల్, అజయ్!

గర్భస్థ శిశు హత్యల సమస్యను అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న లఘు చిత్రంలో బాలీవుడ్ స్టార్ దంపతులు అజయ్ దేవగన్, కాజోల్ లు నటించనున్నారు. శిశు హత్యలను ఆరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ప్రచారానికి అజయ్, కాజోల్ లు చేయూతనివ్వనున్నారు. మహరాష్ట్రలోని లాతూరు, సోలాపూర్,కర్ణాటక లోని బీదర్ ప్రాంతాల్లో గర్భస్థ శిశు హత్యలు ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. నెలరోజుల్లో చిత్ర షూటింగ్ ను ప్రారంభిస్తామన్నారు. కాజోల్ తో కలిసి లఘు చిత్రంలో నటిస్టున్నానని అజయ్ తెలిపారు. ఇటీవల ఆరంభమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో తొలి ఎపిసోడ్ లో ఆడ శిశు హత్యలను మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

posted in: Entertainment, Hindi, News, News Update

Leave a Reply